ఆడవాళ్లతో పెట్టుకుంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూడా కూలిపోయాయనే వాస్తవం మన అందరికి కూడా తెలిసిందే. ఇక చరిత్ర దాకా ఎందుకు గాని ప్రేయసి కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకు చచ్చిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలా జరిగాయనే చెప్పాలి.ఇంకా ఇప్పటికి కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వివాదాలు అనేవి మనుషులకు పరిమితం కాలేదు. జంతువుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అవును మీరు విన్నది నిజంగా వాస్తవం. ఓ ఆడ పులిని మెప్పించడం కోసం రెండు మగ పులులు చాలా తీవ్రంగా పోట్లాడుకున్నాయి. ఇక వాటి పోరుని కనుక చూస్తే గుండెలదిరిపోవాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతూ దెబ్బకు జడుసుకుంటున్నారు.ఇక ఈ వైరల్ వీడియోలో కొందరు పర్యాటకులు అడవిలో సఫారీలో పర్యటిస్తూ జంతువులను చూస్తున్నారు. ఇంతలో రోడ్డు మధ్య నుంచి రెండు పులులు కలిసి మెలిసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. రోడ్డుకు అవతలి వైపున ఓ ఆడ పులి నుంచోని ఉంది. దానిని గమనించిన ఈ రెండు పులులు దెబ్బకు ఉన్నట్లుండి గొడవపడ్డాయి. రెండు పులులు తమ పంజాలతో తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అత్యంత భీకరంగా అవి పోట్లాడుకున్నాయి. 


అప్పటి దాకా సన్నిహితంగా ఉన్న పులులు.. ఒక్కసారిగా రౌద్రరూపంతో ఒకదానిపై మరొకటి విరుచుకుపడటం చూసి అక్కడున్న పర్యాటకులు సైతం హడలిపోయారు. ఇక ఈ రెండు పులులు చాలాసేపు పోట్లాడుకున్న తరువాత ఒక పులి దెబ్బకు వెనక్కి తగ్గింది. దాంతో ఆ రెండు విడిపోయి వేరు వేరు అయ్యాయి. మరోవైపు ఈ రెండు పులులు చాలా దారుణంగా పోట్లాడుకుంటుంటే.. పక్కనే ఉన్న ఆడ పులి ఆ దృశ్యాన్ని ప్రశాంతంగా తిలకించింది. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా నుంచోని వాటి ఫైట్ ని ఆస్వాదించింది.ఇక ఈ భీకర పోరుకు సంబంధించిన వీడియోను ఐఎస్ఎఫ్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు బాగా హడలిపోతున్నారు. ఈ దృశ్యం వీడియోలో చూస్తేనే ఇంత భీకరంగా ఉంది..ఇక నేరుగా చూస్తే సీన్ ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందోనని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి దాకా మొత్తం 15 వేల మందికిపైగా వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: