మాములుగా పెళ్ళి అంటే చాలా హంగామా ఉంటుంది..జీవితంలో ఒకసారి చేసుకొనె ఈ పెళ్ళిలో ఏదేదో చేయాలనీ అనుకుంటారు.. అందరికి మర్చిపొలెని గుర్తులు మిగల్చాలని అంటారు.కొన్ని సార్లు చేస్తున్న ప్రయత్నాలు జనాలకు బాగా నచ్చితే మరి కొన్ని సార్లు చెసినవి కోపాన్ని తెప్పిస్తున్నాయి.. మన రాష్ట్రాల్లో కాదు కానీ, నార్త్ లో అయితే పెళ్ళి వేడుకలు చాలా గమ్మత్తుగా వుంటాయి. వాళ్ళు పెళ్ళికి ముందు 10 రోజుల నుంచి చేస్తున్న హంగామా అయితే పీక్స్ అనే చెప్పాలి.కొన్నిసార్లు పెళ్ళిలో వరుడు చేసే అల్లరి మాత్రం జనాలను నవ్విస్తుంది.


ఒక్కోసారి చేస్తున్న అల్లరి మాత్రం పెళ్ళి కూథురుకు కోపాన్ని తెప్పిస్తుంది.ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..పెళ్ళి అవుతుందన్న సంతోషం లో పెళ్ళి కొడుకు పీకలు దాకా తాగి తెగ హంగామా చేశాడు.అంతేకాదు ఫుల్లుగా తాగి  ఓ రేంజ్ లో డ్యాన్స్ వేశాడు. అది చూసిన పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుకు షాక్ ఇచ్చింది. అతన్ని వద్దనుకొని వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.దాంతో అతను మత్తు కాస్త దిగింది.

 

వివరాల్లొకి వెళితే.. రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది.అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్‌ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు.రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు...మొత్తానికి లబొదిబొ అన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: