చిన్నచిన్న కారణాలకే మానవత్వం ఉన్న మనుషులు సైకోలు గా మారిపోతున్నారా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నచిన్న కారణాలకే ఉన్మాదులు గా  మారిపోతూ ఏకంగా సాటి మనుషులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. కాగా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 9 ఏళ్ల బాలుడు విషయంలో కాస్తయినా జాలీ దయా చూపించలేదు సదరు వ్యక్తులు. ఏకంగా పిడిగుద్దులు కురిపిస్తూ అతని దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.


 అయితే 9 ఏళ్ళ బాలుడిని దారుణంగా చితకబాదడానికి కారణం అతను దొంగతనం చేశాడు అన్న అనుమానమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. నివాస ప్రాంతం లోని ఒక వీధిలో బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని క్రూరంగా చితకబాదారు. ఇక ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది అని చెప్పాలి. ఆ బాలుడి పై దాడికి పాల్పడిన వారిలో స్పెషల్ ఆర్మూడ్ ఫోర్స్ ఆరో బెటాలియన్కు చెందిన అశోక్ తప్పా అనే కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.


 ఇద్దరు వ్యక్తులు బైక్లపై వచ్చారు. ఈ క్రమంలోనే  అక్కడ ఆడుకుంటున్న బాలుడిని పట్టుకున్నారు. కాగా తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి దారుణంగా పిల్లాడిని కొట్టాడు. కాలితో తన్నాడు. ఇక ఆ తర్వాత మరో వ్యక్తి పిల్లాడిని జుట్టు పట్టుకుని కనికరం లేకుండా పిడిగుద్దులు కురిపించాడూ. అయితే ఆ బాలుడు ని ఎందుకు కొడుతున్నారు అని మరో వ్యక్తి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన ఓ మహిళ వారిని ఆపడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి బైక్పై ఎక్కించుకుని వెళ్లారు. ఘటన  పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: