వ్యాధుల భారిన పడటం: శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉండే స్త్రీల రోగనిరోధక శక్తి చాలా బలహీనమవుతుంది. దాంతో వారు త్వరగా జబ్బుల భారిన పడతారు. విటమిన్ డి లోపం వలన బాధపడే వారు తరచుగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి గురవుతుంటారు. ఇటువంటి వారు తమ రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవాలి అంటే విటమిన్ డి ని శరీరంలో పెరిగేలా చూసుకోవాలి.
బలహీనంగా ఉంటారు: విటమిన్ డి తక్కువగా ఉండే మహిళలు ఎక్కువగా అలసిపోతుంటారు. చిన్న పనికి కూడా త్వరగా నీరస పడిపోతుంటారు, ఇందుకు ముఖ్య కారణం శరీరంలో విటమిన్ డి లోపమే అంటున్నారు వైద్యులు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నా కూడా శరీరంలో అలసట అనేది ఎక్కువగా ఉంటుంది.
గాయాలు త్వరగా మానవు: శరీరంలో విటమిన్ డి కనుక తగిన స్థాయిలో లేనట్లయితే గాయాలు త్వరగా మానవు.
ఎముకలు బలహీనత: విటమిన్ డి లోపం వలన ఎముకలు , కీళ్లు నొప్పిగా ఉంటాయి. ఎముకలు క్షీణించి చాలా పెళుసుగా మారుతాయి. ఇలాంటి వారి ఎముకలు చిన్న చిన్న పనులకే విరిగిపోవడం భయంకరంగా నొప్పి ఉండటం వంటివి చూస్తుంటాం.