ఏదియో ఒకటి సాధించాలని గట్టిగా అనుకున్నారు. ఇద్దరు తమకు వచ్చిన ఐడియాలను పంచుకుంటూ ఉండేవారు. అలా వీరికి ఒక ఐడియా తట్టింది. అదే బర్రెలు అమ్మడం. అదేంటి వినడానికి విచిత్రంగా ఉందా? ఈ ఆలోచనే వీరికి కోట్లు సంపాదించడానికి కారణం అయింది. ఇక వెంటనే 2019 వ సంవత్సరంలో బెంగుళూరు లో ఒక చిన్న రూమ్ ను అద్దెకు తీసుకున్నారు. ఒక యానిమల్ యాప్ ను రూపొందించి దాని ద్వారా బర్రెల అమ్మకాన్ని స్టార్ట్ చేశారు. ఈ యాప్ లో రైతులు ఎవరైనా వారి బర్రెలను అమ్మవచ్చు మరియు కొనవచ్చు. కానీ అప్పుడప్పుడే ఈ యాప్ రావడంతో ఆ సంవత్సరానికి కేవలం 50 బర్రెలను మాత్రమే అమ్మగలిగారు.
అయితే లాక్ డౌన్ రాకతో వీరి యాప్ బాగా ప్రసిద్ధి చెందింది. దీనితో ఆ తర్వాత ఈ యాప్ ను హిందీలోనూ తయారుచేసారు. మొత్తం రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాల్లో 80 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దెబ్బతో ఈ యాప్ కు ఆదరణ మాములుగా లేదు . ఇప్పుడు ఒక నెలకు 50 వేల బర్రెలను అమ్మే స్థాయికి చేరుకున్నారు. ఆ విధంగా వీరు వందల కోట్లు ఈ వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్నారు. ఒక ఉద్యోగం మొదలైన వీరి ఆలోచన ఇప్పుడు ఎవరి మీదా ఆధారపడకుండా ఇంత స్థాయికి చేరుకోవడంతో అందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.