సాధారణంగా మనం ఒక హోటల్ లేదా రెస్టారెంట్ లకి వెళ్ళినపుడు రెస్ట్ రూమ్స్ కి సహజంగా వెళ్తుంటాం.. కానీ ఇప్పుడు ఆ రెస్ట్ రూమ్స్ కి వెళ్లాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు అలోచించి భయపడుతూ..  జంకుతూ వెళ్ళలిసిందే.. రెస్ట్ రూమ్ కి వెళ్ళడానికి భయమెందుకు అనుకుంటున్నారా.. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు అలానే అంటారు కాబోలు.. పుణేలోని ఒక కేఫ్‌ కి వెళ్లి తదుపరి టాయిలెట్ కి వెళ్ళింది మహిళ. లోపల దాచిన కెమెరాలో ఆ మహిళ ఏం చేస్తుందో మొత్తం రికార్డు అయింది.
 
ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. అంతేగాక సదరు మహిళ తాను కెమెరాను ఎలా కనుగొన్నదనే విషయమై ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌షాట్ల రూపంలో వివరించింది. ఈ ఘటనపై స్పందించిన పూణే పోలీసులు స్పందిస్తూ..  ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం పంపించామని, కేఫ్‌పై తగిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.


వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం పూణేలోని హింజావాడి ఏరియాలోని కేఫ్‌ బిహైవ్‌కు ఓ మహిళ కాఫీ తాగేందుకు వచ్చింది. రెస్ట్‌ రూమ్‌కు అని వెళ్లిన సదరు మహిళ టాయిలెట్‌లో కెమెరా ఉన్నట్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసుకుంది. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకురాగా ఆమెను 10 నిమిషాలు బయటికి పంపించి కెమెరాను రహస్యంగా తొలగించారు. 


ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తనకు లంచం కూడా ఇవ్వబోయారని సదరు మహిళ పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్న కేఫ్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: