దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియాంక రెడ్డి మర్డర్ లో నేరస్థుల గురించి ఎన్నో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన చాలా మందిని కలిచివేసింది. హైదరాబాద్ లాంటి సిటీలో మహిళలకు రక్షణ లేకపోవటం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకా రెడ్డి పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి - ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుల గురించి బయటకు వస్తున్న వాస్తవాలు వింటే నిజంగానే వారు క్రూరత్వం కంటే కూడా మించిన నేర స్వభావం ఉన్న వారిగా చెప్పాల్సిందే. ఒంటరిగా దొరికిన ప్రియాంకను తమ వద్ద నుంచి కట్టు కదలకుండా తమదైన మాయాజాలంతో వ్యవహరించిన నిందితులు ఆమెపై సాగించిన అకృత్యం గురించి వింటుంటే... నిజంగానే ఒళ్లు గగుర్పొడుస్తుందని చెప్పక తప్పదు.

 

ఈ క్రూర మృగాలు కంటికి కనిపించిన ఏ అమ్మాయిని వదిలే రకం కాదు. ఇందులో దురదృష్టకర విషయమేమిటంటే అందరి వయసు 25 లోపలే ఉండటం. ప్రియాంకే కాదు తమ కళ్లకు కనబడిన ఏ మహిళను కూడా వదిలే రకం కాని నిందితులు... తమ నేర స్వభావం ఏ పాటిదో చెప్పకనే చెప్పుకున్నారు. గురువారం సాయంత్రం తమ కంటబడిన వెంటనే ప్రియాంకను టార్గెట్ గా చేసుకున్న ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా... ప్రియాంక వదిలి వెళ్లిన బైక్ వద్దే మకాం వేసి ఆమె తిరిగి తన బైక్ వద్దకు వచ్చేదాకా అక్కడే ఉండిపోయాడట. ఆ తర్వాత ప్రియాంక తన బైక్ ను తీసుకుని వెళ్లేందుకు యత్నించగా... బైక్ కు స్వయంగా తానే పంక్చర్ చేసిన పాషా... ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నటించి... తన వద్ద నుంచి ప్రియాంక కదలకుండా వ్యవహించాడట.

 

తప్పించుకోకుండా ప్రియాంకను బలవంతంగా ఈ మృగాలు వ్యవహరించారు. అంతేకాకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు యత్నించిన ప్రియాంకకు బలవంతంగా మద్యం తాగించి ఆపై తన అకృత్యానికి తెర తీశాడట. ఆ తర్వాత తన వెంటే సాగిన మిగిలిన ముగ్గురు నిందితులు జొల్లు నవీన్ - చింతకుంట చెన్నకేశవులు - జిల్లు శివలతో కలిసి ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం జరిగిన వెంటనే సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నలుగురి నేర స్వభావాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: