పది రోజుల క్రితం జరిగిన "దిశ"హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృషించింది. నలుగురు మానవ మృగాలు అత్యంత దారుణంగా, లైంగికంగా  వేధించి, సజీవంగా ఉండగానే చంపేశారు.. ఎంతో భవిష్యత్తు ఉన్న "దిశ " జీవితాన్ని దిక్కు తోచని స్థితిలో చిదిమేశారు.. దిశ తల్లి తండ్రులు ఉసురు పోసుకున్నారు..


ఈ ఘటన జరిగి అక్షరాలా ఈరోజు కి 10 రోజులు అయింది. దిశ తల్లి తండ్రులు చనిపోయిన కూతురికి "దశ దిన "ఖర్మ చేసారు. పుట్టెడు దుఃఖంతో దిశ కి దినం చేసారు.. యాదృచ్చికం ఏంటంటే దశ దిన కర్మ రోజే దిశ ని అత్యంత కిరాతకంగా చంపినా నలుగురు రాక్షసులని పోలీసులు చంపేశారు.


ఈ విషయం తెలుసుకున్న దిశ తల్లితండ్రులు ఎవరిని చంపినా, ఏమి చేసిన చనిపోయిన మా కూతురు తిరిగిరాదు. కాని మా కూతురిని చంపినా రాక్షసులని చంపి నా కూతురు చావుకి, ఆత్మ కి న్యాయం చేసారు అన్నారు.. ఇలాంటి పరిస్థితి ఏ ఆడబిడ్డ  కి రాకుండా ఇకనుండి అయినా చుడండి అని పోలీసులకి తెలిపారు..


ఎక్కడ అయితే దిశ ని చంపేశారో అక్కడే వీళ్ళని కూడా చంపేశారు.పోలీసులు చేసిన ఈ ఎంకౌంటర్ కి ప్రజలు , సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేసారు.. ఈరోజు "దిశ "దశ దిన కర్మ. ఇదే రోజు దిశను చంపిన వాళ్ళని చంపడం నిజంగా మనకు కనపడని దేవుడు !! మనకి కనిపించే దేవుడి తో (పోలీస్)చంపించాడు .. కోట్ల మంది కోరిక నెరవేర్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: