అమ్మాయి ఎన్నో ఆశలతో.. కోరికలతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ.. పెళ్లి చేసుకున్న నవ వధువుకు షాక్ ఎదురైంది. ఎన్నాళ్లో వేచిన శోభనం రాత్రి తన భర్తతో కలిసి తన కోరికను తీర్చుకోవాలనుకుంది ఆ యువతి.ఐతే ఆ యువతి ఆశలు ఆవిరయిపోయాయి.  దీంతో కలత చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 

 

వివరాల్లోకి వెళితే... ముర్షిదాబాద్ కు చెందిన రేచల్ (పేరు మార్చబడింది) గత వారం అదే పట్టణానికి చెందిన సమీర్ (పేరు మార్చబడింది) తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. భారీగా కట్నకానుకలు సైతం సమర్పించారు. అయితే పెళ్లయిన అత్తారింట్లోకి అడుగుపెట్టిన రేచల్‌ శోభనం గురించి ఎన్నో కలలు కన్నది. అనుకున్నట్లుగానే శోభనం రాత్రి తన భర్తతో కలసి పడకసుఖం కోసం సిద్ధమైంది. ఇంతలో సమీర్ శోభనం గదిలో పాలు తాగి మంచెమెక్కి గుర్రు పెట్టి నిద్ర పోయాడు. దీంతో షాక్ తిన్న రేచల్, అతడిని లేపి శోభనం రాత్రి కోరికలు తీర్చుకుందామని ప్రోత్సహించింది. ఇంతలో సమీర్ ఇవేవి తనకు పట్టనట్లు వ్యవహరించాడు. అంతేకాదు తనలో ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చాడు.


అయితే తొలి రాత్రి బిడియంతో సమీర్ అలా వ్యవహరించాడని మొదట రేచల్ అనుకుంది. అయితే వరుసగా మూడు రాత్రులు అలాగే గడిచిపోయాయి. దీంతో రేచల్ తనకు అన్యాయం జరిగిందని గుర్తించింది. వెంటనే తన పుట్టింటి వారికి ఫోన్ చేసి పిలిపించగా, అంతా కలిసి అత్తింటి వారిని నిలదీశారు. 


అయితే అత్తింటి వారు, తమ కుమారుడిలో ఏ లోపం లేదని, రేచల్ కావాలనే అలా చేసిందని ఆమెపై ఆరోపణలు చేశారు. అంతేకాదు రేచల్ కుటుంబ సభ్యుల పై దాడికి దిగేందుకు సైతం సిద్ధమై పోయారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: