కల్చర్ మారింది.. ఒకప్పుడు ఉద్యోగం చేసే మహిళలు కాళీ సమయం దొికినప్పుడల్లా ఈ గుడిలోనో లేదా కుటుంబ సబ్యులతోనో గడిపే వారు.. కానీ ఇప్పుడు వీకెండ్ వస్తె చాలు.. పబ్లు క్లబ్బులు అంటూ తెగ తిరగేస్తున్నా రు.. ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే ఎంజాయ్ చేద్దామని ఓ మహిళ అలానే పబ్ కు వెళ్ళింది.. అక్కడ టాయిలెట్ లో వీడియోను తీస్తుండటం చూసి విస్తు పోయింది..

 

 

ఎవరో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ మహిళ పబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన కూడా వాడు పట్టిచుకొకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది..వివరాల్లోకి వెళితే..ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 34 ఏళ్ల మంజు(పేరు మార్చాం) వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు మెక్‌గ్రాత్ రోడ్డులోని ఓ పబ్‌కి వెళ్లింది. కొద్దిసేపు సరదాగా గడిపిన మంజు టాయిలెట్‌కి వెళ్లిన సమయంలో చేదు అనుభవం ఎదురైంది. తను టాయిలెట్‌లో ఉండగా గుర్తు తెలియని ఆగంతకుడు మొబైల్ ఫోన్‌లో వీడియో తీస్తూ కనిపించాడు. టాయిలెట్‌లో నుంచి ఆమె పైకి చూడగా మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తూ ఓ చేయి కపడింది.

 

అది గమనించిన ఆమె పెద్దగా కేకలు వేసింది..స్నేహితురాలు కేకలు విని అతనిని పట్టుకునేందుకు వెంబడించినప్పటికీ దొరక్కుండా పారిపోయాడు. అయితే అతను పబ్ సిబ్బంది యూనిఫాం ధరించి ఉన్నాడని చెప్పడంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పబ్ యాజమాన్యం లైట్ తీసుకోవడమే కాకుండా.. అలాంటివి జరిగే అవకాశమే లేదని బుకాయించడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

 

రంగ ప్రవేశం చేసిన పోలీసులు పబ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు..పబ్‌లో పని చేస్తున్న బుద్ధికాంత్ దేబ్‌నాధ్‌ను నిందితుడిగా గుర్తించారు. కేవలం మూడు నెలల క్రితమే దేబ్‌నాధ్ పబ్‌లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. మహిళ టాయిలెట్‌లో ఉండగా చిత్రీకరించిన దృశ్యాలను అతను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు గుర్తించారు...అందుకే సుమీ పబ్ కు వెళ్ళండి ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: