మైసూర్ పాక్.. దీని గురించి ఎవరికీ తెలియదు అండి.. ఇంట్లోనే చేసుకొనే అద్భుత పదార్ధం. అలాంటి ఈ మైసూర్ పాక్ ని జీడిపప్పు మైసూర్ పాక్ గా చేస్తే.. ఎంత రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా? జీడిపప్పు మైసూర్ పాక్ ను? ఆ అద్భుత రుచిని ఆస్వాదించార? అప్పట్లో అంటే నానమ్మ లేదా అమ్మమ చేసి పెట్టేవాళ్ళు.. మన అమ్మ వాళ్ళు చూసి.. చేశాక రుచి చూసేవాళ్ళు. అలాంటి ఈ మైసూర్ పాక్ ను ఇప్పుడు చేసుకొని తినండి.. అద్భుత రుచిని పొందండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

జీడిపప్పు పొడి, మైదా- ఒక్కోటి 1/3 కప్పు, 

 

నెయ్యి- 3 కప్పులు,

 

యాలకుల పొడి- 1/2 టీ స్పూను,

 

పంచదార- 3/4 కప్పు .

 

తయారీ విధానం... 

 

ఒక గిన్నెలో జీడిపప్పు పొడి, మైదా, యాలకుల పొడి, అరకప్పు వేడి నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తరువాత మరో గిన్నెలో పంచదార, 1/3 కప్పు నీళ్ళు పోసి తీగపాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత మంట తగ్గించి జీడిపప్పు పొడి మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో వేడి నెయ్యిని కొద్దికొద్దిగా కాస్త ఎత్తు నుంచి పోయాలి. 

 

ఇలా పదార్థం అంచుల నుంచి నెయ్యి వెలువడే వరకూ కలుపుతూ ఉండాలి. మైసూర్‌ పాక్‌ తయారు అయ్యిందా? లేదా అనేది తెలియాలి అంటే.. అర టీ స్పూను చల్లటి నీళ్ళు పదార్థంపై జల్లితే చిటపటలాడాలి. వెంటనే పదార్థాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని వేడిగా ఉండగానే ముక్కలు కోసి, ఏదో ఒక మూల ఒక ముక్కను తీసి వేసి ఆవైపు పళ్ళేన్ని కాస్త పల్లంగా ఉంచాలి. దానివల్ల ఇంచు మించు కప్పుకు పైగా నెయ్యి బయటకు వచ్చేస్తుంది. అంతే.. మైసూర్ పాక్ రెడీ.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసుకొని తినేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: