మామూలుగా అమ్మాయిలు మోసపోతున్నారు అని చాలా మంది అనుకుంటారు.. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అమ్మాయిలతో ప్రేమ పెళ్లి అని గాలం వేసి మోసం చేస్తే మగాళ్లకు డబ్బు అసనీ లేదా ఉద్యోగమో చూపించి మోసం చేస్తున్నారట...అయితే ఏంటి మోసం చేయడానికి మాకు అంటూ అంటున్నారు.. వారి గురించి తెలియక చాలా మంది మోసపోతున్నారు..అందుకే ఎవరిని నమ్మొద్దని అంటారు..
వివరాల్లోకి వెళితే..గుంటూరు ప్రాంతానికి చెందిన బేతపూడి చినరామయ్య అలియాస్ రావూరి రాము అప్పులపాలై వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి కాలేదని తెలుగు మ్యాట్రిమొనిలో వధువు కావాలని పెట్టి, తాను ఎయిర్పోర్ట్లో పనిచేస్తానని మభ్యపెట్టి పలువురిని మోసగించాడు. కైకలూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మకం కలిగించాడు. వీరిద్దరూ ఏలూరుబస్టాండ్లో ఒకరినొకరు కలుసుకుని. అలా చనువు పెంచుకున్నారు..
గుంటూరు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్నాడని.. అన్న వదినలే ఉన్నారని చెప్పాడు..అంతేకాకుండా .. తనకు అర్జెంట్ గా రెండు లక్షలు కావాలని కోరాడు.. ఆమె ఏటీఎమ్ తీసుకొని మొత్తానికి డబ్బులు తీసుకున్నాడు . మరి విషయమేంటటే..ఆమె ఎయిర్ పోర్టులో జాబ్ కూడా ఇప్పిస్తానని నమ్మపలికాడు.. అలా ఆమె మోసపోయిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు.. మొత్తానికి నిండా మునిగాక ఆమెకు అన్ని తెలిసి వచ్చాయి.
మరో విషయం అబ్బాయిలకు అయితే జాబ్ లు ఇప్పిస్తామంటూ డబ్బులు లాగి మోసం చేస్తున్నారు..మోసాలు పెట్టింది పేరుగా వరుస దారుణాలకు పాల్పడుతున్నాడు.. అందుకే అతని గుట్టు రట్టు చేశారు పోలీసులు..పోలీసులు అతనిపై నిఘా పెట్టి శుక్రవారం కైకలూరు రైల్వేస్టేషన్లో మరో యువతితో పెళ్లి సంబంధం మాట్లాడునేందుకు వచ్చిన అతడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అతడిపై విజయవాడ, వీరవల్లి పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయని పోలీసులు దర్యాప్తులో పేర్కొన్నారు..