ఇటీవ‌ల కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. ఎన్ని క‌ఠ‌న‌మైన‌ చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

 

చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట మాన‌వ మృగాల బారిని ఆడ‌వాళ్లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు ప్ర‌తి ఏటా పెరుగుతున్నాయే త‌ప్పా త‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక తాజాగా అమ్మమ్మ ఇంట్లో  ఉంటున్న యువతిపై తాత, మేనమామ లైంగికదాడికి పాల్ప డ్డారు. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట మహ్మద్‌నగర్‌కు చెందిన షేక్‌ అప్సర్‌ (70) ఇంట్లో మనుమరాలు (19) ఉంటుంది. 

 

యువతి  తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా, తల్లి మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంది. యువతిపై తాత అప్సర్‌, మేనమామ సిద్ధిఖ్‌ ఒకరికి తెలియకుండా మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు  తల్లికి విషయం చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: