సెక్స్ రాకెట్ దందా నిర్వహించేందుకు అమాయక యువతులను వేలాది కిలోమీటర్లు దాటిస్తున్నారు.. దేశం కాని దేశానికి తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారు.. నరక కూపంలోకి నెట్టి ఎంతో మంది అమాయక యువతులు, మహిళలు, బాలికలను బలి చేస్తున్నారు. విచ్చలవిడిగా చెలరేగుతున్న ఈ దందా ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు నింపుతోంది. అలాగే టెక్నాలజీని వినియోగించుకుంటూ సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తూ వ్యాపారం సాగిస్తున్నాయి. 

 

స్వదేశీ అమ్మాయిలతో పాటు విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి ఆదాయం పెంచుకుంటున్నారు. అంతేకాదు వీరు ఆఫ‌ర్లు కూడా ఇస్తుండ‌డం వార్త‌ల్లో నిలుస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ను చేధించారు. అయితే ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. విటులను ఆకర్షించేందుకు నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారట. విదేశీ యువతిని బుక్ చేసుకున్న విటుడికి ఓ స్వదేశీ యువతితో ఫ్రీగా పడక సుఖం అందిస్తారట. రైడింగ్‌లో పట్టుబడిన విటులు ఈ విషయం చెప్పడంతో పోలీసులు షాక్ గుర‌య్యారు.

 

షాపింగ్ మాల్స్‌కు మించి వీళ్ల ఆఫ‌ర్లు ఉన్నాయంటూ నోరెళ్లబెట్టారు. కాగా, ఈ సందర్భంగా పలువురు అమ్మాయిలను రక్షించి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన యువతుల్లో విదేశీయులు కూడా ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులు రష్యా, సెర్బియా, ఉక్రెయిన్ దేశాల నుంచి అమ్మాయిలను విజిటింగ్ వీసాలపై రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పుణెకు చెందిన సోనీ(36) అనే మహిళ ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: