మనదేశంలో చిన్నారులు, మహిళలపై రోజు రోజుకూ లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా మృగాళ్లలో మార్పు రావడంలేదు. దేశంలో మ‌హిళ‌లు, చిన్నారుల భద్రత గాల్లో దీపంలా తయారైంది. ప్రస్తుతం వారిపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు యావత్‌ దేశాన్ని ఆలోచనలో పడేసింది. చదువుకునే బడి, గుడి, పనిచేసే ఆఫీసు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఇన్‌స్టిట్యూట్‌లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, రైళ్లు, ఆటోలు, క్యాబ్‌లు.. ఇలా ఎక్కడా బాలికలు, మహిళలకు భద్రత, భరోసా లేకుండా పోతోంది.

 

కామంతో క‌ళ్లు మూసుకుపోయి వావివ‌ర‌స‌.. చిన్న‌పెద్దా ఇవేమి లేకుండా కొంద‌రు మాన‌వ మృగాలుగా త‌యార‌వుతున్నారు. ఇక తాజాగా వరుసకు వివాహితపై ఆడపడుచు భర్త (అంటే వ‌ర‌స‌కు అన్న‌య్య‌) లైంగిక దాడికి తెగబడ్డాడు. జనవరి 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే ప్రతి శుక్రవారం ఆరికిరేవుల వస్తుంటాడు. అయితే ఆ గ్రామానికి చెందిన తన బావమరిది ఇంటికి ప్రతివారం  వస్తుండేవాడు. 

 

అలా జనవరి 31న ఉదయం కూడా వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బావమరిది భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మ‌రియు ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి బయట ఎవరికైనా చెబితే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మౌనంగా ఉంటే  ఐదువేలు ఇస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియ‌క ఆమెలోనే ఆమె కుములిపోయింది. అయితే ఎట్టకేలకు విషయం  భర్త, అత్తమామలకు చెప్పి వారి సహకారంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: