ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుండగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం.. ఈ సినిమా దసరా కి గానీ దసరా తర్వాత గానీ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.. ఈ సినిమా ల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ లో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.. ఈనేపథ్యంలో ఆదిపురుష్ కి ఏదోటి ఆటంకం కలగడం అభిమానుల్లో టెన్షన్ ని కలిగిస్తుంది..
ఆదిపురుష్ షూటింగ్ మొదలు అయ్యాక అగ్ని ప్రమాదం మొదలు, మహారాష్ట్ర లాక్ డౌన్ దాకా అన్నీ ఇబ్బందులే.తాజాగా హైదరాబాద్లో షూటింగ్ ప్లాన్ చేసిన యూనిట్కు తెలంగాణలోనూ లాక్ డౌన్ ప్రకటించటంతో మరో షాక్ తగిలినట్లు అయింది. నిజానికి సినిమా ప్రారంభమైన రోజే ఫైర్ యాక్సిడెంట్ కావటంతో షూటింగ్ ఆపేశారు. తరువాత ఆర్టిస్ట్ల డేట్స్ కుదరక షూటింగ్ షెడ్యూల్ అంతా గందరగోళంగా మారింది. ఇక షెడ్యూల్ కాస్త గాడిలో పడుతుందన్న సమయానికి ముంబైలో లాక్ డౌన్ పెట్టేశారు. ఈ దెబ్బకు ప్రభాస్ సహా మూవీ టీమ్ అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు.దీంతో ఈ సమస్య తగ్గించుకోవడానికి ఈ సినిమా నిర్మాతలు ఏదైనా హోమం లాంటిది చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.