ఇక ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో  అంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది.చాలా కంపెనీలు కూడా తమ ఈ బైక్స్ ని ఆవిష్కరిస్తున్నాయి. మంచి మంచి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ విషయంలో ఓలా కంపెనీ మిగిలిన కంపెనీల అన్నిటికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకే దేశంలోనే నంబర్ వన్ ఈవీ తయారీదారుగా ఓలా కంపెనీ నిలిచింది. ఈ నేపథ్యంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 కు సంబంధించి ఓ ప్రత్యేక అప్ డేట్ ని కంపెనీ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఓలా ఎస్1 కంపెనీ కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే మాక్సిమం 115 కి.మీ. వెళ్లగలదు.దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుంది.ఇంకా అలాగే దీనిలో రివర్స్ మోడ్‌, హిల్ హోల్డ్ ఫీచర్లు కూడా ఉంటాయి. నార్మల్, స్పోర్ట్స్  ఇంకా హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది. ఈ స్కూటర్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కి.మీ. మైలేజీ అనేది వస్తుంది.ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం రీచార్జ్ చేసుకోవచ్చు.


ఇక 2022 వ సంవత్సరంలో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశంలోనే నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకుంది. కంపెనీ ఏకంగా మొత్తం 1,50,000 యూనిట్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది.ఇక వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గమినిస్తూ తమ మోడల్స్ ని అప్ గ్రేడ్ చేయడంలో ఓలా ముందువరుసలో ఉంటుంది. అందుకే తమ ఎస్1 ఇంకా అలాగే ఎస్1 ప్రో వేరియంట్లో గెరువా ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీనిలో అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నట్లు సమాచారం.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఓలా ఎస్ 1 వేరియంట్ ను ఐదు కొత్త రంగులలో లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కలర్స్ కు అదనంగా మార్ష్‌మల్లో, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ ఇంకా అలాగే మ్యాట్ బ్లాక్ లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ చెప్పింది. ఇక ఐదు రంగులతో కలపి ఇప్పటి వరకూ ఓలా ఎస్1 స్కూటర్ మొత్తం 11 రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: