అబుదాబిలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై కోల్కతా 2 పరుగుల తేడాతో గెలిచింది.
పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74),
మయాంక్ అగర్వాల్(56) బ్యాటింగ్ వృథా అయింది. కోల్కతా బౌలర్లలో ప్రసిద్ధ్
కృష్ణ 3,
నరైన్ 2 వికెట్లు తీశారు.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58) ధనాధన్ ఇన్నింగ్స్తో పాటు శుభ్మన్(57) బ్యాట్తో రాణించారు.
పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్,
రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58), శుభ్మన్ గిల్(57) ఆకట్టుకున్నారు. మిగిలిన బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్,
రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.