అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​పై కోల్​కతా  2 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74), మయాంక్ అగర్వాల్(56) బ్యాటింగ్ వృథా అయింది. కోల్​కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, నరైన్ 2 వికెట్లు​ తీశారు.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్​కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58) ధనాధన్ ఇన్నింగ్స్​తో పాటు శుభ్​మన్(57) బ్యాట్​తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.


అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58), శుభ్​మన్ గిల్(57) ఆకట్టుకున్నారు. మిగిలిన బ్యాట్స్​మెన్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: