రాజమండ్రి వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాలు కేసులో మిస్టరీ వీడింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో కుమార్తెలు, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీ నగర్ కు చెందిన అక్క  మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా  గుర్తించారు. 


గత నెల 31న రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో  చికిత్స పొందుతూ  మృతుల తల్లి కన్నుమూసింది. అంత్యక్రియలు అనంతరం తండ్రిని ఇంటికి పంపి గోదావరిలో అక్కాచెళ్లెల్లు, తమ్ముడు దూకినట్లు గుర్తించారు. ఈ నెల ఒకటిన రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో మూడు మృతదేహాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. మూడు రోజులు మార్చురీలో ఉన్న మృతదేహాల వద్దకు ఎవరూ రాకపోవడంతో రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు ఖననం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: