నిజామాబాద్ లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ప్రేమ‌జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌టన చందూర్ లోని ల‌క్ష్మాపూర్ అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రేమికులు మెస్రా మండ‌లం తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు మోహ‌న్ మ‌రియు ల‌క్ష్మి గా గుర్తించారు. అయితే వీరు మూడు రోజుల క్రిత‌మే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అట‌వీ ప్రాంతం వైపు కొంత మంది గ్రామ‌స్థులు న‌డుచుకుంటూ వెళుతుండ‌గా దుర్వాస‌న రావ‌డంతో చెట్టువ‌ద్ద‌కు వెళ్లి ప‌రిశీలిచారు. కాగా చెట్టుకు వేళాడుతున్న మృత‌దేహాల‌ను చూసి షాక్ అయ్యారు. వెంట‌నే పోలుసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారు మోహ‌న్ ల‌క్ష్మిగా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: