ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈమధ్యనే డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే మరో మంచి శుభ వార్త కూడా రానుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ఇవ్వనుందని సమాచారం తెలుస్తుంది. కేంద్ర ఉద్యోగులను ఆకర్షించేందుకు 8వ వేతన సంఘంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఖచ్చితంగా భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.8వ వేతన సంఘంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ కూడా పార్లమెంట్‌లో మాట్లాడటం జరిగింది. 8వ వేతన సంఘం వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతం భారీగా పెరుగుతుందని చెప్పారు. 7వ వేతన సంఘంతో పోల్చి.. కొత్త పే కమిషన్‌ జీతాన్ని లెక్కిస్తారు.


కొత్త వేతన సంఘం 2024 సంవత్సరం చివరి కెల్లా ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఆ తరువాత ఒకటి రెండు సంవత్సరాలలో అమలవుతుంది. అంటే.. 2025 వ సంవత్సరం చివరి నాటికి లేదా 2026 వ సంవత్సరం ప్రారంభంలో 8వ వేతన సంఘం అమలు కానుందని చెబుతున్నారు. కొత్త పే కమిషన్‌లో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఫిట్‌మెంట్ ఆధారంగా కాకుండా.. వేరే ఫార్ములా ద్వారా జీతాలు పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్‌ అంశాన్ని ప్రాతిపదికగా పరిశీలిస్తే మొత్తం 2.57 రెట్లు పెరిగింది. జీతం పెంపుని మొత్తం 14.29 శాతం పెంచగా.. బేసిక్ శాలరీ వచ్చేసి రూ.18 వేలు అయింది. ఇక ఎనిమిదో పే కమిషన్‌లో అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. దీని ఆధారంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లకు పెంచే ఛాన్స్ ఉంది. ఇదే కనుక జరిగితే ఉద్యోగుల బేసిక్ శాలరీ మొత్తం 44.44 శాతం పెరగనుంది.ఇక అప్పుడు కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: