ఇటీవల కాలం లో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోతుంది అన్న దానికి నిదర్శనం గా ఎన్నో ఘటనలు నిలుస్తున్నాయి. సొంత వాళ్ల విషయం లో కూడా కనీసం జాలి దయ చూపించనీ మనుషులు దారుణం గా హత్యలు చేస్తూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి  పడేలా  చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది.  కని పెంచిన తల్లిదండ్రుల విషయం లో కాస్త అయినా జాలి చూపించలేకపోయాడు కొడుకు. ఇప్పుడు  దారుణంగా తల్లిదండ్రులను చంపడమే  కాదు  ఎవరికి తెలియకుండా ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతేసాడు.


 అయితే తర్వాత రోజు అత్తారింటి నుంచి ఇంటికి వచ్చిన పెద్దకొడుకు తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు అంటూ తమ్ముడిని అడిగితే తనకు తెలియదు అంటూ సమాధానం చెప్పాడు. కానీ ఆ తర్వాత రోజు ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పెద్దకొడుకు. ఇక పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ లో వెలుగులోకి వచ్చింది. జై రామ్ సింగ్ సుందరీబాయి దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్దకొడుకు హేమంత్ వివాహం చేసుకునే అత్తారింట్లో ఉంటుండగా 17 ఏళ్ళ చిన్న కొడుకు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.



 ఇకపోతే ఇటీవల తల్లి  దండ్రులను  చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టగా.. దుర్వాసన రావడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు హేమంత్. అయితే ఇక హేమంత్ సోదరుడిని అదుపు లోకి తీసుకొని విచారించారు పోలీసులు.. అయితే తన తల్లి దండ్రులు ఎప్పుడూ అన్నయ్య ని ప్రేమగా చూసే వారిని అందుకే కోపం తో చంపేసాను అంటూ పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు సదరు యువకుడు. నిందితుడి  మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: