సాదరణంగా మనం ఉంటున్న ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైనా పాడుపడిన బంగ్లా ఉంది అంటే చాలు అటువైపు వెళ్లడానికి ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. నిజంగానే దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. ఆ పాడుబడిన బంగ్లాలోకి వెళ్తే మాత్రం దయ్యం కనిపిస్తుంది అని ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు. అంతేకాదు ఇక పాడుబడిన బంగ్లా వైపు వెళ్తే అపశకునం  జరుగుతుందని కూడా మరి కొంతమంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక ఎక్కడైనా పాడుబడిన బంగాళా కనిపించింది అంటే చాలు అటువైపు వెళ్లేంత సాహసం చేయరు అని చెప్పాలి.


 అయితే కొన్ని ప్రాంతాలలో ఉన్నట్లుగానే ఇక హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా ఒక పాడుబడిన బంగ్లా ఉంది. అయితే అటువైపు దాదాపుగా ఎవరు వెళ్ళరు. కానీ ఇటీవలే ఆ పాడుబడిన ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం మొదలైంది. అయితే మొదట్లో స్థానికులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఏదో జరిగిందని అనుమానం వారి మనసులో వచ్చింది. దీంతో దుర్వాసన రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ కనిపించిన సీన్ చూసి ఇక వారి గుండెలు అదిరిపోయాయి అని చెప్పాలి. దీంతో దెబ్బకి అక్కడ నుంచి వెనక్కి పరుగులు పెట్టారు.


 హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నెంబర్ 273 వద్ద ఓ పాడుబడిన ఇంట్లో నుంచి దుర్వాసన రాగ స్థానికులు వెళ్లి చూసారు. అయితే సగం కాలిన మృతదేహం అక్కడ కనిపించింది. అయితే భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త స్థానికులు అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: