స్పైసీ మసాలా బాత్ రైస్ తయారీ విధానం.... ముందుగా లవంగాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి మెత్తటి పొడి చేసుకోవాలి. స్టవ్ కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నిలువుగా కోసిన దొండకాయల ముక్కలు వేసి వేయించాలి. ఇందులో లవంగాల మిశ్రమం వేసి బాగా కలపాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా వేసి వేయించాలి. కడిగిన బియ్యాన్ని అందులో వేసి వేయించి, తగినంత ఉప్పు వేసి కలపాలి. అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. స్టవ్ కట్టేయానికి ముందు ఓసారి గరిటెతో కలిపేసి, పైన జీడిపప్పు చల్లాలి. అనంతరం స్టవ్ కట్టేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా బాత్ రైస్ తయారైనట్లే..