మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన మంచి మురళి (45) మనోహరాబాద్ లోని జేఎంజే స్కూల్ వాచ్మెన్గా విధులు నిర్వహించేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మంచి మురళికి కాలు విరిగింది.దీంతో ఏ పని లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.. చేతిలో చిల్లి గవ్వ లేదని, పిల్లల పరిస్థితి ఎంటి అంటూ ఎప్పుడు అతనితో వాగ్వాదానికి దిగేది.. వారంలో రెండు, మూడు సార్లు అతనికి బుద్ది చెప్తుంది..సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి రోకలిబండతో భర్త మురళిని తల, చాతిపై మోది హత్య చేసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కిరణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు..