ఏపి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీియట్ అకడమిక్ క్యాలెండర్ ను తాజాగా విడుదల చేసింది.