పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 45,650 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,800 రూపాయలుగా నమోదు అయింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే పెరిగాయి. ఈరోజు 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 70వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి