షుగర్ కంట్రోల్ లో వుండాలంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక షుగర్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య బాగా పెరుగుతాయి. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. హార్మోన్లలో మార్పులు ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడం ఇంకా నిద్రపోయే ముందు ఏదైనా ట్యాబ్లట్స్ తీసుకోవడం లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్న తర్వాత నిద్రపోవడం వంటి చాలా కారణాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి అసలైన కారణం కావొచ్చు. ఇక దాన్ని కంట్రోల్ చేసేందుకు మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రపోయే ముందు ఎక్కువ ఫైబర్ ఇంకా అలాగే తక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి చాలా స్థిరంగా ఉంటాయి. అలాగే రాత్రివేళ ఖచ్చితంగా మితంగా భోజనం అనేది చేయండి.

నిద్రపోయే ముందు కొంతమందికి కాఫీ తాగడం అనేది అలవాటు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం రాత్రివేళ కాఫీ, చాక్లెట్, సోడా వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. కెఫీన్‌తో కూడిన ఆహార పదార్ధాలు మెదడును బాగా ఉత్తేజపరుస్తాయి. కెఫీన్ మీ నిద్రను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అలాగే డయాబెటిక్ రోగులు ఆల్కహాల్‌కు కూడా చాలా దూరంగా ఉండండి.ఇక రాత్రి భోజనం తరువాత డయాబెటిక్ పేషెంట్స్ కాస్త వాకింగ్‌కు వెళ్లండి. మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ఇక పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల మీకు బాగా నిద్రపడుతుంది. ఒకవేళ వ్యాయామం కనుక చేయలేకపోతే.. ఖచ్చితంగా వాకింగ్‌కు వెళ్లండి.ఇక నిద్రపోయే ముందు మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. మొబైల్‌ను పూర్తిగా సైలెంట్‌లో పెట్టుకుని మీరు పడుకొని బాగా రిలాక్స్ అవ్వండి. అందువల్ల మీకు మంచి నిద్ర అనేది పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: