ఒక టీ స్పూన్ మెంతులను, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, నాలుగు లవంగాలను, రెండు యాలకులను, 6 తులసి ఆకులను, ఒక టీ స్పూన్ పసుపును ఇంకా అలాగే రెండు గ్లాసుల నీటిని తీసుకోండి. ఇక ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో పైన పదార్థాలన్నీ వేసి రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి.తరువాత ఈ నీరుని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీని రోజూ ఉదయం టీ తాగే సమయంలో తీసుకోవాలి. ఇంకా అలాగే ఈ టీ గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ టీ ని తీసుకోవడానికి అర గంట ముందు అలాగే తీసుకున్న తరువాత అరగంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా పది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులోకి వస్తుంది. ఈ టీ తయారీలో వాడిన పదార్థాలన్నీ కూడా మన వంటింట్లో వుండే పదార్ధాలే.


ఈ పదార్థాలు ఔషధ గుణాలతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాన్ని సహజంగానే కలిగి ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.అజీర్తి ఇంకా మలబద్దకం వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా ఈజీగా కరిగి సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీని తాగడం వల్ల దగ్గు, ఆస్థమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఇంకా అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా ఈ టీ కి ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచి ఫలితాలతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడాఈజీగా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: