ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది.  తినే తిండి నుండి కంటి నిండా నిద్ర వరకూ అన్నింట్లో కూడా విపరీతంగా మార్పులు వచ్చేస్తున్న నేపథ్యంలో వీటికి తోడు మానసిక సమస్యలు పని ఒత్తిడి మరింత మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతను ప్రభావితం చేసే అత్యంత సాధారణ సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి.  ఈ సమస్య మానవ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలుసు.. అయితే అధిక రక్తపోటు సమస్య వచ్చినప్పుడు అన్ని అనర్ధాలే జరుగుతాయి.. కాబట్టి ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి..

అధిక రక్తపోటు సమస్య వచ్చినప్పుడు కళ్ళల్లోకి వెళ్లే సూక్ష్మ నేరాలు పలుచబడి రక్తప్రసరణ నిలిచిపోయి కంటి చూపు కూడా దెబ్బతింటుంది . ఈ సమస్యను హైపర్ టెన్షన్ రెటినోపతి అని పిలుస్తారు. ఐరిస్ స్క్రీన్ ప్రాంతం వెనుక ఉన్న సన్నని కండరాలను పెంచడానికి ఒత్తిడి చాలా ప్రభావితం చేస్తుంది.. దీంతో కళ్ళల్లో నీరు కారడం ,మసకబారడం , చూపు పూర్తిగా కోల్పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుపాపకు రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు దృష్టి నష్టం కూడా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధిక రక్తపోటు వల్ల మెదడుకు దారి తీసే సిరలలో రక్తప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.  దీని కారణంగా స్ట్రోక్ విషయంలో మెదడులోని చిత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా దెబ్బతింటుందట. కాబట్టి హైపర్ టెన్షన్ గా తగ్గించుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం ధ్యానం చేయడం లేదా యోగా చేయడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. డయాబెటిక్ కానీ పెద్దలలో కూడా 10 శాతం మంది రెటినోపతిని కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు అనేది గుండెపోటు గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు రాకుండా ముందే జాగ్రత్త పడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BP