రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దివంగత వైఎస్సార్కు వీర విధేయులు చాలామంది ఉన్నారు. అలా వైఎస్సార్పై విధేయత చాటుకునే నాయకుల్లో రాజన్న దొర కూడా ఒకరు. వైఎస్సార్ అండతోనే రాజన్న 2004 ఎన్నికల్లో విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ అనూహ్యంగా వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చారు.