విశాఖపట్నంలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. అయితే స్వల్ప మెజారిటీ తేడాతోనే వైసీపీ నుంచి రమణమూర్తి రాజు విజయం సాధించారు. ఈయనే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇలా మూడుసార్లు గెలవడంతో ఈ సారి జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు.