ఇకపోతే భారతదేశంలో ఎక్కువగా అధిక రక్తపోటు, డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తాజాగా నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ హెల్త్ ప్లస్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ కొత్త రైడర్ ప్లాన్ లో ఒకటవ రోజు నుంచి మధుమేహం, రక్త పోటు సంబంధిత సమస్యలకు కవరేజీని అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా రీ అష్యూర్ ప్లాన్ కోసం సైన్ అప్ చేసేవారికి రైడర్ అందుబాటులో ఉంటుంది అని ఆ కంపెనీ ప్రకటించింది. ఇక డయాబెటిస్, బిపి తో బాధపడేవారు ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి వారికి తక్షణమే కవరేజ్ అందేలాగా ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. Lరోగులు ఆందోళన చెందకుండా ఉండడం కోసమే ఈ సరికొత్త కవరేజ్ ప్లాన్ తీసుకొచ్చామని కంపెనీ కూడా తెలిపింది.
ఈ ప్లాన్ తీసుకున్న వారు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియంపై 20 శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు. ఇక డబ్బులు లేక ఇబ్బంది పడే ఎంతోమంది ఈ పాలసీని తీసుకొని మొదటి రోజు నుంచే లాభం పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.