దిశ అపహరణ, అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు నిందితులు షాద్ నగర్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు ఎక్కడైతే నిందితులు నేరానికి పాల్పడ్డారో అక్కడే చనిపోయారు. దిశ హత్య కేసులో తక్షణ న్యాయం అందించినందుకు పోలీసులు, ప్రభుత్వంపై అందరూ ప్రశంసలు కురిపించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ దిశకు న్యాయం జరిగిందని ట్వీట్లు చేశారు. సమంతా అక్కినేని కూడా నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించి, “ఐ లవ్ తెలంగాణ. సమస్యకు భయం ఒక గొప్ప పరిష్కారం మరియు కొన్నిసార్లు అది ఒక్కటే  పరిష్కారం అవుతుంది ” అంటూ ట్వీట్ చేశారు.

 

సమంత అక్కినేని, తన సోషల్ మీడియాలో చలాకీగా ఉంటారు, ప్రతీ విషయం తన అభిమానులతో పంచుకుంటారు. తెలంగాణలో జరిగిన దిశ అత్యాచార సంఘటనపై సమంత మొదట్లో మౌనం పాటించింది, కానీ నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు అన్న వార్త విన్నప్పుడు, ఆమె ముందుకు వచ్చి దిశ అత్యాచారం మరియు హత్య కేసుపై స్పందించింది. 

 

ఈ విషయంపై ఆమె మొదట ఎందుకు మౌనం పాటించిందో చెప్పారు, “దిశ అత్యాచారం మరియు హత్య సంఘటన జరిగినప్పుడు నేను స్పందించలేదు, భాదితులకు సంతాపం తెలియజేయలేదని ఆరోపిస్తూ నేను అందుకున్న ప్రతీ సందేశం నాకు ఒకటి గుర్తుచేస్తుంది. నేను చేసిన ఒక్క ట్వీట్ వల్ల వాళ్ళ బాధ దూరమవ్వదు, నిజం చెప్పాలంటే వాళ్ళ కోసం మనం ఏమీ చేయలేనప్పుడు ట్వీట్ చేయడం ఎందుకు" అని చెప్పారు సమంత.

 

ప్రస్తుతం సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 (వెబ్ సిరీస్) లో  కనిపించనున్నారు. ఫ్యామిలీ మ్యాన్ ఒక మధ్యతరగతి వ్యక్తి, మనోజ్ బాజ్‌పేయి ఈ వెబ్ సిరీస్ లో రహస్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోసం పనిచేస్తారు. మొదటి సీజన్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, కిషోర్ కుమార్ మరియు గుల్ పనాగ్ ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ సెప్టెంబర్ 20 న ఒక ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో విడుదల చేశారు. ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ చాలా ప్రశంసలు పొందింది. రెండవ సీజన్లో, మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీ పాత్రను పోషించనున్నారు, ఇది భారతదేశ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ యొక్క టాస్క్ ఫోర్స్‌లో సీనియర్ అనలిస్టుగా పనిచేస్తున్న వ్యక్తి కథ. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంతా ఉగ్రవాది పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: