ప్రస్తుతం మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలసి అడివి శేషు ఓ చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన రెండు కీలక విషయాలను బయటపెట్టారు. మొదటిది ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అడివి శేషును మీకు గర్ల్ ఫ్రెండ్ వుందా అని ప్రశ్నను టక్కున అడగడంతో.... అవును నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని సీక్రెట్ రివీల్ చేశాడు ఈ 36 ఏళ్ల డైనమిక్ హీరో. అంతేకాదు ఇంట్లోనూ త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రెండవది..... ఎంతో ఘన విజయం సాధించిన మీ గూడచారి సినిమాకు సీక్వెల్ రానుందా...??? అంటే... అవును అని సమాధానం ఇచ్చారు. 2022లో గూఢచారి సినిమా సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు అడవి శేషు. 2018లో వచ్చిన గూఢచారి సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఆయన అభిమానులకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు లభించాయి. ప్రస్తుతం అడవి శేషు నటిస్తున్న తాజా చిత్రం *మేజర్*.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
గూడచారి సినిమా తర్వాత మరోసారి అడవి శేషు, శోభిత ధూళిపాల హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడం విశేషం. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ సైయీ మంజ్రేకర్ కూడా మరో హీరోయిన్ గా కనిపించనున్నారు.