తెలుగు చిత్ర పరిశ్రమకి నువ్వు నేను సినిమాతో పరిచయమైన నటి అనిత. ఈ సినిమాతో ఇండస్ట్రీలో అనితకు మంచి పేరు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీరామ్’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాలలో నటించింది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఈ జంటకు పండంటి మగబిడ్డ జన్మించింది. చాలా కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. పెళ్లి తరువాత కూడా బుల్లితెరపై సందడి చేస్తోంది.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కావడంతో ఇంటికే పరిమితమైంది అనిత. కాలక్షేపం కోసం పలు వీడియోలను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ప్రాంక్ అని చెబుతూ ఏకంగా భర్త చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియో అనిత భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనుక నిలబడి ఆమె చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుండి తీస్తున్నట్లు యాక్ట్ చేస్తూ.. సడెన్ గా అతడి చెంప మీద గట్టిగా కొట్టింది.

అయితే భార్య చేసిన పనికి షాకైన రోహిత్ రెడ్డి అక్కడ నుండి సీరియస్ గా వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్ ట్రిక్ తప్పకుండా నచ్చుతుందని.. ఈ ట్రిక్ ను ఇంట్లో ప్రయత్నించండి అంటూ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. తనను ఇలా ఆదుకున్న భార్యను విడిచిపెట్టేదే లేదని.. త్వరలోనే రివెంజ్ తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు రోహిత్ రెడ్డి. రీసెంట్ గా మరో వీడియో షేర్ చేసింది అనిత. అందులో మ్యాజిక్ చేస్తున్నానని చెబుతూ.. కప్పులో వాటర్ తీసుకొని తన భర్తపై ఒంపేసింది. ఈ వీడియోకి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: