మెగాస్టార్ ఆచార్య  సినిమా తర్వాత వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు. ఇప్పటికే మెహర్ రమేష్ తో వేదాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడు చిరు. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.

రీమేక్ కు ముందుగా సాహో  దర్శకుడు సుజిత్ ను అనుకున్నారు. కానీ ఈ కుర్ర డైరెక్టర్ సినిమాలో చేసిన మార్పులు మెగాస్టార్ కు నచ్చక పోవడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో `తని ఒరువన్` ఫేం మోహన్ రాజాని దర్శకుడిగా ఎంపిక చేశారు. అతడు ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. పలుమార్లు చిరుతో స్క్రిప్టు విషయం చర్చించినా కానీ ఆయన పూర్తిగా సంతృప్తి చెందలేదని రకరకాల మార్పులు సూచించారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఎంత కథలో మార్పులు చేసినా మెగాస్టార్ ను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోతున్నాడట అని వచ్చిన వార్తలన్నీటికీ ఈరోజు తో చెక్ పడినట్టు అయింది.

 ఈ రోజు ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా పుట్టినరోజు అయితే ఈరోజు ఈ లూసిఫర్ సినిమాకి సంబంధించిన అందరూ ఆయనని విష్ చేశారు. అయితే అందరిలోనూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషెస్ ఈ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. థమన్ డైరెక్టర్ మోహన్ రాజా కి విషెస్ చెప్తూ మన లూసిఫర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అలాగే నీకు కూడా బ్లాక్ బస్టర్ పుట్టినరోజు అని థమన్ విష్ చేశారు. ఇప్పటికే థమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ లో కొట్టిన బిజియం గురించి ఇప్పటికి మాట్లాడకుంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ కి థమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ కొడతాడో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: