పెద్ద హీరోల సరసన నటించిన ఆమె ప్రస్తుతం దాదాపు 10 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
తమిళ సినిమా పరిశ్రమలో సైతం సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంటుంది. మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్,
నాగచైతన్య సరసన థాంక్యూ సినిమాలలో నటిస్తుంది. తమిళంలో కార్తీతో సర్దార్ అనే
సినిమా చేస్తుంది.
ఇకపోతే
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది
హీరోయిన్ లు పూర్తి కథ విని
సినిమా ఒకే చేస్తూ ఉంటారు. కొంతమంది
డైరెక్టర్ ను నమ్మి
సినిమా చేస్తూ ఉంటారు ఆ విధంగా
రాశి తల్లి ఓ
డైరెక్టర్ చెప్పిన కథను విని ఏకంగా ఏడ్చేసిందట. ఆ సిని మా ఏదో కాదు.. నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం.
పెళ్లి విశిష్టతను తెలియజేసే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వెగ్నేశ సతీష్.
సినిమా సూప ర్ హిట్ కాకపోయినా కాన్సెప్టు పరం గా మంచి మార్కు లు కొట్టేసింది ఈ సినిమా. అయితే ఈ
సినిమా కథ మొత్తం విన్న తర్వాత
రాశి ఖన్నా కు నచ్చడమే కాకుండా ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. ఆ కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారట ఆమె.