తెలుగు చిత్ర పరిశ్రమకి మూల స్తంభమైన అక్కినేని నాగేశ్వరావు కుటుంబం నుండి చాలా మంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. అలాగే సుమంత్ అక్కినేని మ‌న‌మ‌డిగా ప‌రిచియ‌మైన ఎందుకో అనుకున్నంతగా పేరు, గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. సుమంత్ అడ‌పాడ‌ద‌పా సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.

సుమంత్ ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చిన తరువాత  ‘మళ్లీ రావా’ అనే మ‌రో సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పై రివ్యూస్‌, అన్ని బాగానే ఉన్న‌ప్ప‌టీకి క‌లెక్ష‌న్స్ మాత్రం అనుకునంతగా రాలేదనే చెప్పాలి మరి. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో సుమంత్ త‌న వైవ‌హిక జీవితాన్ని గురించి చెప్పుకొచ్చారు సుమంత్.

అయితే పవర్ ప‌వ‌ర్‌ స్టార్ ప‌వన్‌ క‌ల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన సినిమా తొలిప్రేమ‌. ఈ సినిమాతోనే కీర్తి రెడ్డికి ఓ రేంజ్ లో పాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా తరువాత ఆమె పలు సినిమాలో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. అయితే  కీర్తి రెడ్డి, సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరి బంధం ఎక్కువ రోజులు నివలేకపోయింది. ఇద్దరు కలిసి రెండేళ్లు జీవనం సాగించారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకున్నారు.

ఇక సుమంత్ నుండి విడిపోయిన కీర్తి రెండో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే  సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు. సుమంత్ కీర్తితో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో ఒక్కసారి చూద్దామా. అయితే పెళ్లి త‌ర్వాత ఏడాదిన్న‌ర మాత్ర‌మే వారిద్దరూ కలిసి ఉన్నారు. ఇక ఆ స‌మ‌యంలోనే మా జీవితాలు వేరు, మా వ్య‌క్తిత్వాలు వేరు అని తేలింది. అయితే ఎంతోకాలం క‌లిసి ఉండ‌లేమ‌ని అర్థ‌మ‌వ‌డంతో ఉమ్మ‌డి అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సుమంత్ చెప్పారు. కీర్తి రెడ్డి ఇప్ప‌టికీ నా ఫ్రెండే అని అన్నారు. అంతేకాదు.. ఆమెతో అప్పుడ‌ప్పుడు మాట్లాడుతుంటానని చెప్పుకొచ్చారు. ఇక తాత ఏఎన్నార్ చనిపోయిన‌పుడు చివ‌రిసారి కీర్తి ఇక్క‌డ‌కు వ‌చ్చింద`ని సుమంత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: