పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా సినిమాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మన డార్లింగ్ 'రాధేశ్యామ్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. వన్స్ రంగం లోకి దిగితే బాక్స్ బద్దలే అంటూ హుషారు చూపిస్తోంది. ఇక మరో పాన్ ఇండియా మూవీ 'సలార్' కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రభాస్ యూరప్ ట్రిప్ కారణంగా కాస్త షూటింగ్ వాయిదా పడ్డ ఈ మూవీ ఇపుడు డార్లింగ్ యూరప్ ట్రిప్ ముగించుకుని తిరిగి రావడంతో మళ్ళీ పట్టాలెక్కబోతుంది. ఈ ట్రిప్ మూడ్ నుండి బయటకొచ్చిన ప్రభాస్ ఇపుడు తన ఫోకస్ అంతా పెండింగ్ ప్రాజెక్ట్ లపై పెట్టారు.

దాంతో క్యూ లో ముందున్న సలార్ మూవీని లైన్ లో పెట్టేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు షెడ్యుల్ రెడీ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం కి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోగా మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా పచ్చ జెండా ఊపాలని అనుకుంటున్నారట మన బాహుబలి. అయితే సలార్ మూవీ షూటింగ్ మళ్ళీ  ఎపుడు ఏంటి అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

కేజీఫ్ చిత్రంతో ఒక్క సారిగా పలు భాషల్లో ఇమేజ్ పెంచుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు రెబల్ స్టార్ మరో వైపు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇలా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అని టాక్ , హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీ గానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మరి కెజీఫ్ డైరెక్టర్ మరియు కండల ధీరుడు ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: