అని తెలుస్తోంది.మోత మోగిస్తున్నాడుగా...ఊపు మామూలుగా లేదు!
"డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు"
అంటూ గోదావరి తీరాన డీజే టిల్లు మోత మోగించాడు.చిత్ర విజయోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేశాడు. హీరోయిన్ నేహాశెట్టితో కలిసి చిందులువేశాడు.ఆయన వెంట డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా ఉన్నాడు.తొలుత ఈరోజు ఉదయం (15.02.2022.మంగళవారం ఉదయం) విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాడు.అనంతరం ఏలూరులోని విజయలక్ష్మి , కొవ్వూరు లోని వై స్క్రీన్స్ , రాజమండ్రిలోని శ్యామల థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకుని వారితో తన ఆనందం పంచుకున్నాడు.
విశాఖ తీరాన సక్సెస్ మీట్ రండి రా రండి..
ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..డీజేటిల్లు సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక రాధిక తో నేను పడుతున్న పాట్లు చూశారుగా మిమ్మల్ని ఏడిపించేంతవరకూ నవ్వించాలి అనుకున్నాం అదే ఇప్పుడు సాధ్యం అయింది అని అన్నాడు.హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ టిల్లు తో కలసి మిమ్మల్ని నేరుగా కలుసుకోవడం చాలా ఆనందగా ఉంది..అని పేర్కొంది.దర్శకుడు విమల్ మాట్లాడుతూ..డీజేటిల్లు కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ నా జీవితంలో మర్చిపోలేను అని అన్నాడు.అనంతరం చిత్ర బృందం ఉత్తరాంధ్ర కు ప్రయాణమైంది. రేపు (16-2-22)అక్కడి థియేటర్లలోనూ, సాయంత్రం వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం లో జరిగే సక్సెస్ మీట్ లోనూ పాల్గోనుంది.