గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అయితే ఎందుకు ఇలా అనేది ఎవరికీ అర్థం కావడం  అయితే అది బాలయ్య తాజాగా చేసిన అఖండ సినిమా ఎఫెక్ట్ లేదా హీరోలకు ఎవరికి ఖాళీ లేకపోవడమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పోతే బాలయ్య అఖండ సన్నాఫ్ తర్వాత గోపీచంద్ మలినేని తో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గోపి గోపీచంద్ కాంబినేషన్లో సినిమా అయిన వెంటనే అనిల్ రావిపూడి తో బాలయ్యకు మరో సినిమా ఉంది. ఇక వీటి అనంతరం వెంటనే కొరటాల శివ ఒక మంచి సబ్జెక్టుతో రెడీగా ఉన్నాడు.

ఇక ఇదిలా ఉండగా పూరి అయితే బాలయ్య కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు.అయితే  వీళ్ళ స్టేటసే పెండింగ్లో ఉంటే సంపత్ నంది కూడా బాలయ్యతో సినిమా చెయ్యడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే అతని సొంత ఊర్లో బాలయ్యతో తన నెక్స్ట్ సినిమా అని చెప్పేసి వచ్చినట్టు మొన్నామధ్య వార్తలు వచ్చాయి.ఇకపోతే  'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్లో సంపత్ నంది ప్రాజెక్టు మొదలుకావాల్సి ఉంది. ఇక కాకపోతే దర్శకుడు బాబీకి కూడా ఆ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఎప్పుడో సైన్ చేసాడు.

అయితే అతను కూడా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడట. అంతేకాకుండా చిరుతో సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో సినిమా చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇకపోతే ఈ రెండు కథలు విన్న 'సితార ఎంటర్టైన్మెంట్స్' వారు సందిగ్ధంలో పడినట్టు సమాచారం.అయితే  వాళ్ళకైతే ఈ రెండు కథలు నచ్చాయి…ఇక  పైగా ఇద్దరూ కూడా స్టార్ డైరెక్టర్లు. కాబట్టి బాలయ్య ముందు ఈ రెండు కథల్ని ఉంచి.. అంతేకాకుండా ఆయనకి ఏ కథ నచ్చితే ఆ కథతో ప్రాజెక్టుని సెట్ చెయ్యాలని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: