రాజమౌళి తో సినిమాలు అంటే ప్రతి హీరో ఆసక్తి చూపిస్తారు. ఆయన తో సినిమాలు చేస్తె అవి ఖచ్చితంగా భారీ హిట్ ను అందుకుంటాయని అందరి నమ్మకం. అందుకే ఆయన తో సినిమాలు చేయాలంటే అందరు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత అంతకు మించి ఉండేలా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా ఆర్ఆర్ఆర్..  రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన తరువాత మొత్తానికి మార్చి 25 న విడుదల కానుంది.


ఈ సినిమాపై జనాల్లొ మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి జక్కన్న ప్రమోషన్స్ లో జొరును పెంచారు.  ఆ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌలి తర్వాత తియ్యబోయే సినిమా పై అందరి దృష్టి పడింది.. ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా చెయనున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆ సినిమా ఎప్పుడూ అనేది అందరికి సందెహాన్ని కలిగిస్తున్నాయి. మహేష్ తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నారు అనే  వార్త చక్కర్లు కోడుతుంది..


అయితే ఈ వార్తల్లో నిజం లేదని, మహేశ్‌తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జక్కన్న క్లారిటీ ఇచ్చారు.. ట్రిపుల్ ఆర్  సినిమా రాజమౌళి హాలీడ్‌ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ట్రిప్‌ తర్వాత మహేశ్‌ తో చేయాల్సిన సినిమాపై రాజమౌళి ఫోకస్ పెట్టాడు.. ఈ లోపు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాను స్టార్ట్‌ చేస్తాడు. ఆ తర్వాత జక్కన్న మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మహేశ్‌తో చేయాల్సిన మూవీని పూర్తిగా ఆఫ్రికన్ అడవి నేపథ్యం లో సినిమాను రూపొందించడానికి జక్కన్న అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: