గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎక్కడ ఉన్నా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు టీమ్ వారిని సంప్రదించి వారికి కావాల్సిన చికిత్స ను చేయిస్తున్నారు. ఆంధ్రా ఆసుపత్రి తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.వెయ్యి ఆపరేషన్ లు పైగా చేయించినా కూడా మహేష్ బాబు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఇటీవలే ఏకంగా తన పేరుతో పౌండేషన్ ను ఏర్పాటు చేసి మరిన్ని గుండెలను కాపాడేందుకు ముందుకు వచ్చి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ తో చిన్నారుల గుండె ఆపరేషన్ లు చేయించేందుకు దేవుడిలా ముందుకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంను సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ చూసుకుంటూ ఉంటారు.తాజాగా ఆమె సోషల్ మీడియాలోఈ ఫోటో ను షేర్ చేశారు. ఒకే రోజు 30 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించినట్లుగా ఆమె తెలియజేశారు. ప్రపంచ హెల్త్ డే సందర్బంగా ఒకే సారి ముప్పై మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించినట్లుగా ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ను ఆంద్ర ప్రదేశ్ గౌరవ గవర్నర్ బిశ్వ భూషన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసినట్లుగా నమ్రత పోస్ట్ లో తెలియజేశారు.
ఈ బృహత్ కార్యక్రమంలో మాతో భాగస్వామ్యం అయినందుకు గాను ఆంధ్రా ఆసుపత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ నమ్రత సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. వందల మంది చిన్నారుల గుండెలను కాపాడిన ఘనత మహేష్ నమ్రతలు దక్కించుకున్నారు. వారికి చిన్నారుల ప్రాముఖ్యత.. వారి ఆరోగ్యం గురించి తెలుసు కనుకే ఈ పని చేస్తున్నట్లుగా సూపర్ స్టార్ అభిమానులు చెబుతూ ఉంటారు.సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మాట్లాడేది తక్కువ కాని చేసే మంచు పనులు ఎక్కువ. ఇలా తను సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పేద వాళ్లకి సాయం చేయాలనుకునేకునే మంచి మనసు ఆయన సొంతం. అంత మంచి మనిషి కాబట్టే కొన్ని లక్షల అభిమానులను సంపాదించుకొని రియల్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్.ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరోగా సర్కారు వారి పాట సినిమాతో రాబోతున్నారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: