ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనకి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అనేది ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూ లలో ఆర్జీవీ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే  శ్రీదేవి తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతటి స్థాయిలో ఇష్టపడే మరో వ్యక్తి అలనాటి కథానాయికి సహజనటి జయసుధ. ఆ తర్వాత అంతలా వర్మ  సహజనటి జయసుధను ఇష్టపడినట్లు తెలుస్తోంది. జయసుధను ఒక సినిమా పోస్టర్‌పై చూసి తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట వర్మ. అది మరీ ఎంత స్థాయిలో అంటే.. తాను ప్రేమించే జయసుధను, 'శివరంజని' సినిమాలో జయసుధ కష్టాలను చూసిన ఆర్జీవీ, విలన్ గా చేసిన మోహన్ బాబు పై కసితో రగిలిపోయాడట.

ఆ తర్వాత చాలా కాలానికి అదే మోహన్ బాబుతో జయసుధను కలిపి జోడీగా వర్మ తీసిన.. 'రౌడీ' అనే సినిమా తెరకెక్కించిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో 'మనీ' అనే కామెడీ థ్రిల్లర్ వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్లయితే తాను అంతగా ఇష్టపడే జయసుధ రీసెంట్ గా పాడిన 'దైవపుత్రుడు' అనే క్రైస్తవ గీతాన్ని వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. 'హే.. జయసుధగారూ.. మీ పాట వింటే అవిశ్వాసులు సైతం విశ్వాసులుగా మారిపోతారు.'.. అంటూ కాప్షన్ జత ఇస్తూ.. జయసుధ పాడిన పాటకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ లింక్ ను కూడా ఆయన షేర్ చేశాడు.

ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ విషయాన్నీ మన సోషల్ మీడియా ట్రోల్ రాయుళ్లు ఏ విధంగా వివాదం చేస్తారో అన్నది చూడాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం ఆర్జీవీ తెరకెక్కించిన డేంజరస్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: