టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీతిసింగ్. ఈమె ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ పేరు సంపాదించుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నది. ఇటీవల పరస ఫోటో షూట్ లతో బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపుగా ఆరు సినిమాలకు పైగా ఉన్నవి. ప్రస్తుతం నటించిన చిత్రం రన్ వే-34 ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా రకుల్ ప్రీతిసింగ్ పైలెట్ గా నటిస్తున్నట్లుగా సమాచారం. అజయ్ దేవగన్, అమితాబచ్చన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.


ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ  ఉన్నది రకుల్ ప్రీతిసింగ్. టాలీవుడ్ లో అగ్ర హీరోలు సైతం నటించిన రకుల్ ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక గత కొద్ది రోజుల కిందట బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నతో ప్రేమలో ఉన్నట్లు గా తెలియజేసింది. ఇక అప్పట్నుంచి రకుల్ ప్రీతిసింగ్ వివాహం ఎప్పుడు అని మీడియా వారు నెటిజెన్స్ కూడ అడుగుతూనే ఉన్నారు.


మొదట్లో ఈ ప్రశ్న అడగగా రకుల్ ప్రీతిసింగ్ సానుకూలంగా స్పందించే ది కానీ రానురాను మీడియా ముందు కూడా ఈ ప్రశ్న ప్రతిసారీ రావడంతో గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ కాస్త ఘాటుగా ప్రవర్తించినట్లు గా తెలుస్తోంది. అందుకు కారణం తన వివాహమే అన్నట్లుగా వినిపిస్తోంది. తన పెళ్లి ప్రశ్న రాగానే రకుల్ ఈల మాట్లాడుతూ.. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది. అమ్మ నాన్న, తమ్ముడు ఇలా ఎంతోమంది మనలో భాగము జీవిత భాగస్వామి కూడా ప్రతి ఒక్క మనిషికి అలానే ఉంటారు దీనికోసం ప్రత్యేకంగా మాట్లాడారు అవసరం లేదని తెలియజేసింది. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సివస్తే స్వయంగా తెలియజేస్తామని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: