టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన గోపీచంద్ తాజాగా ప్రమాదానికి గురయ్యారు. తాజాగా షూటింగ్ లో పాల్గొంటున్న గోపీచంద్ ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడంతో ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో గోపీచంద్ కు ఎలాంటి గాయాలు కాలేదు అని క్షేమంగానే ఉన్నారు అని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే... గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు లక్ష్యం, లౌక్యం  అనే రెండు సినిమాలు తెరకెక్కాయి.  

ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతోంది.  గోపీచంద్ , శ్రీ వాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరు లో జరుగుతుంది.  అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు.  షూటింగ్ జరుగుతున్న ప్రదేశం లో ఎత్తైన ప్రదేశం నుండి గోపీచంద్ కాలు జారి కింద పడ్డాడు.  అయితే అదృష్టవశాత్తు గోపీచంద్ కు గాయాలు ఏమీ కాలేదు అని క్షేమంగానే ఉన్నారు అని దర్శకుడు  శ్రీ వాస్ తెలియజేశాడు. అభిమానులు ఆందోళన చెందవలసిన పనిలేదు అని శ్రీ వాస్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఈమధ్య విడుదలైన సీటిమార్ సినిమాతో గోపీచంద్ మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.  గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: