వారికి సంబంధించిన విషయాలను గురించి కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. ఏం చెప్పాలి, ఏమి తెలియచేయాలి అనుకుంటున్నారో క్లారిటీ మిస్ అయితే సోషల్ మీడియాలో తమకు తోచింది తాము స్ప్రెడ్ చేసేస్తారు. అయితే అన్ని సార్లు వాస్తవాలు కాదు, అలాగని అన్ని రూమర్స్ మాత్రమే కాదు. అయితే ఒక సెలబ్రిటీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలి అంటే కాస్త ముందు చూపు ఉండాలి అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా పూనమ్ కౌర్ వంటి నటులకు ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈమె చేసిన కొన్ని పోస్ట్స్ వైరల్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇపుడు కూడా అదే తరహాలో ఈమె చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది.
ఇటీవల ఈమె ఇద్దరు పిల్లలతో కలిసి ప్రేమగా తీసుకున్న ఫోటో ఒకటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ను చూసిన కొందరు పూనమ్ రహస్యంగా పెళ్లి చేసుకుంది అని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ విషయం పూనమ్ వరకు వెళ్ళడంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది పూనమ్. అస్సలు భరించలేని విధంగా, బాధ కలిగే విధంగా ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ చాలు అని ఆమె పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఉన్నది మీరు అనుకుంటున్నట్లు నా పిల్లలు కాదు నా స్నేహితుల పిల్లలని క్లారిటీ ఇస్తూ ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని మరింత దారుణంగా మార్చక ముందే దీనిపై స్పష్టత నిచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు సోషల్ మీడియాకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ.. ఇకనైనా నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి అంటూ పూనమ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. కొందరు మాత్రం ఎందుకు అలా ఇబ్బంది పెడుతారు అర్ధం చేసుకోండి అంటూ వ్యంగ్యంగా పోస్ట్ లు పెడుతున్నారు.