ప్రస్తుతం ఆయన శంకర్ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తప్పకుండ ఈ సినిమా తో మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు చరణ్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది అంటున్నారు. త్వరలో హైదరాబాద్ లో మరో కీలక షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు.
ఇంకా ఈ మూవీలో శ్రీకాంత్ నవీన్ చంద్ర సునీల్ అంజలి జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఎన్నో విశేషాలను కలిగి ఉ న్న ఈ సినిమా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. 1930 కాలం నేపథ్యంలో సాగే పీరియడిక్ డ్రామాగా చెప్తున్నా ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన లేటెస్ట్ సంచలనం లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. విక్రమ్ సినిమా తో విజయాన్ని అందుకున్న లోకేష్ తో చరణ్ సినిమా చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందో. మరి వీరి కలయికలో చేయబోతున్న ఈ సినిమా లోకేష్ మల్టీ వర్స్ లో భాగంగా ఉంటుందా అనేది చూడాలి.