మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్తదనం ఉన్న సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు. సినిమా చేసే దర్శకుడు కొంతైనా పాతైనా ఆయనకు కథ నచ్చింది అంటే సినిమా చేస్తాడు. గతంలో రచ్చ సినిమాతో సంపత్ నంది ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేయబోతున్నాడు. అలా పెద్ద, చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ అందరి హీరోలలోకెల్లా ఎంతో వెరైటీ గా ఆయన ముందు వెళుతున్నాడు.

ప్రస్తుతం ఆయన శంకర్ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తప్పకుండ ఈ సినిమా తో మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు చరణ్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది అంటున్నారు. త్వరలో హైదరాబాద్ లో మరో కీలక షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు.

ఇంకా ఈ మూవీలో శ్రీకాంత్ నవీన్ చంద్ర సునీల్ అంజలి జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఎన్నో విశేషాలను కలిగి ఉ న్న ఈ సినిమా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. 1930 కాలం నేపథ్యంలో సాగే పీరియడిక్ డ్రామాగా చెప్తున్నా ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన లేటెస్ట్ సంచలనం లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. విక్రమ్ సినిమా తో విజయాన్ని అందుకున్న లోకేష్ తో చరణ్ సినిమా చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందో. మరి వీరి కలయికలో చేయబోతున్న ఈ సినిమా లోకేష్ మల్టీ వర్స్ లో భాగంగా ఉంటుందా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: