సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నా మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో వరుసగా అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు.

ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి మహర్షి , సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హైట్రిక్ విజయలము అందుకున్నాడు. ఇలా హైట్రిక్ విజయాలను అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత సినిమాగా పరశురామ్ దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మా మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. విడుదలైన మొదటి రోజు నుండే ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ లభించింది. కానీ ఆ టాక్ ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పై ఏమాత్రం లేకుండా అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది. కాకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త ఎక్కువగా జరగడం వల్ల చివరిగా ఈ సినిమా కాస్త  నష్టాలనే చూడవలసి వచ్చింది.  

సర్కారు వారి పాట సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా,  ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లను చూసినట్లయితే 110 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. దానితో ఫైనల్ రన్ ముగిసేసరికి సర్కారు వారి పాట మూవీ కి దాదాపుగా 10 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: